డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబును హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి.
రంగారెడి జిల్లా అభివృద్ధి మరియు పలు అంశాలపై మంత్రితో చర్చించారు.ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు మరింత సేవ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు.గ్రామాభివృద్ధి పాటుపడాలని, ప్రభుత్వం అందేంచే పథకాలను అర్హులైన వారికి అందేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎలుగంటి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు