Posted on 2025-12-31 20:33:56
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థుల నృత్యాలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రాబోయే కొత్త సంవత్సరానికి స్వాగతం తెలిపేందుకు కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు బుధవారం సాయంత్రం జోరుగా హుషారుగా ఆట పాటలతో అదరగొట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో గల కాకతీయ విద్యా సంస్థలో 2025 సంవత్సరం ముగింపు సందర్భంగా వీడ్కోలు పలుకుతూ ఉత్సాహంగా 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినిలు తమ నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 2025 బై బై అంటూ 2026 సంవత్సరానికి వెల్కమ్ అని పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలని వారు అన్నారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని వారు అన్నారు. ఎందుకంటే విద్యార్థులే దేశానికి పునాది లాంటివారని 31 డిసెంబర్ అని ఈవెంట్ ల పేరిట ఎవరి పరిధిలో వారు ఉండాలని, ఈవెంట్లు చేసుకోవడం తప్పుకాదు కానీ వాటి పేరు పేరిట తప్పులో నడవద్దన్నారు. ముఖ్యంగా అతిగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వాహనదారులను వారు కోరారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >