| Daily భారత్
Logo




ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి

News

Posted on 2025-12-24 19:41:12

Share: Share


ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

డైలీ భారత్ న్యూస్,కరీంనగర్:ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ , జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ బుధవారం  జిల్లా కలెక్టర్ పమేలా కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ సి.ఎస్.ఐ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నగర ప్రతినిధులను కలుపుకొని సంబంధిత అధికారులు కార్యక్రమాన్ని సమన్వయం చేసే  ప్రయత్నం చేసారనీ చెప్పారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోను పూర్తిగా విస్మరించారనీ అన్నారు.  మొదటిసారి కాదని ఇటీవల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో (7వ వార్డు) నియోజకవర్గం అయినప్పటికీ అధికారిక ఫోటోలు, సమాచారంలో పొందుపరచలేదనీ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడం అత్యంత అవసరం అని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్, జీడి రమేష్, సముద్రాల లక్ష్మణ్, జుంజుపల్లి వివేక్, గొట్టే బాబు, కనకం విద్యాసాగర్,  యూత్ కాంగ్రెస్ నాయకులు మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.

Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >