Posted on 2025-12-06 15:48:27
ఏబీవీపీ ఇందూర్ కార్యాలయం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం సామాజిక సమరసత దినోత్సవం నిజామాబాద్ లోని ఏబీవీపీ కార్యాలయం ఎదుట నిర్వహించారు.
కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిoధర్,స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత చారి లు పాల్గొన్నారు.
వారితో పాటు విద్యార్థి పరిషత్ నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని 1700 సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురవుతున్న హిందువుల సమానత్వం కోసం అంబేద్కర్ జన జాగరణ ఉద్యమం చేశారని ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు సామాజిక సమానత్వం కోసం జరిగిన ఫ్రెంచ్ విప్లవం, అమెరికాలో తెల్లవారితో సమానంగా నల్లవారి సమాన హక్కుల కోసం జరిగిన ఉద్యమం,రష్యా, చైనాలలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాలలో లక్షలాది మంది చనిపోయారు పెద్ద రక్తపాతం జరిగింది కానీ ఈ దేశంలో సమానత్వం సామాజిక సమ సమానత ఉద్యమంలో ఉద్యమాలలో సామాజిక సమ సమానత ఉద్యమాలలో చుక్క రక్తం కూడా రాలలేదు, ఇలా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తూ మనం కూడా ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి పనిచేయాలని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, జి జి కాలేజ్ ప్రెసిడెంట్ సాయి విగ్నేష్,శశాంక్, సాయికుమార్, విగ్నేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >