| Daily భారత్
Logo




నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2025-12-02 13:34:26

Share: Share


నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా : గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. బోయినపల్లి లోని ఆర్ఓ కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను తనిఖీ చేశారు. నామినేషన్ తోపాటు అభ్యర్థి నూతన బ్యాంక్ ఖాతా కచ్చితంగా ఉండాలని, అన్ని వివరాలు నింపాలని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన తరువాత వారితో ఎన్నికల నియమావళి, వ్యయం వివరాల అందజేతపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

అనంతరం హెల్ప్ డెస్క్ పరిశీలించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. బోయినపల్లి జడ్పీ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి, చేయాల్సిన ఏర్పాట్లపై ఎంపీడీఓ కు సూచనలు చేశారు.

లారీలు అందుబాటులో ఉండాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మేర లారీలు అందుబాటులో ఉండాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతం, తూకం తనిఖీ చేశారు. అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన టార్పాలిన్, వసతులు కల్పించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే సమీప రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ వేగంగా పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం నిలువలకు అనుగుణంగా లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్ర ప్రకాశ్. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల తదితరులు పాల్గొన్నారు.

Image 1

నూతన బోరు మోటర్ బిగింపు

Posted On 2026-04-23 18:59:41

Readmore >
Image 1

సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్

Posted On 2026-04-23 18:39:41

Readmore >
Image 1

జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ

Posted On 2026-04-23 18:36:19

Readmore >
Image 1

రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

Posted On 2026-04-23 18:23:44

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం

Posted On 2026-04-23 18:22:34

Readmore >
Image 1

సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Posted On 2026-04-23 16:56:02

Readmore >
Image 1

పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు

Posted On 2026-04-23 16:50:12

Readmore >
Image 1

కర్మకు కళ్లుంటాయి.... మంజుల పత్తిపాటి

Posted On 2026-04-23 16:49:17

Readmore >
Image 1

ప్రతిభ రత్న అవార్డుకు డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-04-23 11:00:59

Readmore >
Image 1

అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...

Posted On 2026-04-23 10:06:26

Readmore >