Posted on 2025-11-24 15:23:03
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రం లోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలు స్తున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు.సోమవారం షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండోరోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించమని తెలియచేసారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నామని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళల కు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దే శ్యంతో పథకాలకు రూపకల్పన చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోట లక్ష్మీ,గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్దార్ నగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, చేవెళ్ల మార్కెట్ చైర్మన్ పెంటయ్య గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆగి రెడ్డి, వెంకటరెడ్డి, జనార్దన్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, చెన్నయ్య, ప్రతాప్ రెడ్డి, కాజా మియా, రవీందర్ నాయక్, మహేందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కిషోర్, ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మహేష్, సూర్య అధికారులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >