Posted on 2025-11-19 06:48:05
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:ప్రభుత్వ అదిరింది కదా సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. మంత్రి శ్రీధర్ బాబు వాట్సాప్ ద్వారా మీసేవా (MeeSeva) సేవలను అధికారికంగా ప్రారంభించారు.
దీంతో ఎలాంటి యాప్ డౌన్లోడ్ అవసరం లేకుండా, కేవలం వాట్సాప్లో ఒక మెసేజ్ పంపితే సరిపోతుంది.
580కి పైగా ప్రభుత్వ సేవలు ఒకే వాట్సాప్ నంబర్లో
ప్రస్తుతం రాష్ట్రంలోని 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇది దేశంలోనే అత్యంత పెద్ద డిజిటల్ సేవల ఇంటిగ్రేషన్గా భావిస్తున్నారు.
ఇన్కం సర్టిఫికేట్
బర్త్ సర్టిఫికేట్
క్యాస్ట్ సర్టిఫికేట్
డెత్ సర్టిఫికేట్
విద్యుత్ బిల్లుల చెల్లింపు
నీటి బిల్లులు
ఆస్తి పన్నులు
ప్రజలు రోజూ ఉపయోగించే దాదాపు అన్ని సర్వీసులు ఇప్పుడు ఒకే ప్లాట్ఫారమ్లో లభ్యమవుతున్నాయి.
ప్రజలు సేవలను ఎలా పొందాలి?
సేవలను పొందడం చాలా సులభం:
WhatsApp: 80969 58096
ఈ నంబర్కు "Hi" అని పంపాలి.
ఆటోమేటిక్ మెను వస్తుంది.
కావలసిన సేవను సెలెక్ట్ చేసుకుని దరఖాస్తు చేయొచ్చు
ఈ ప్రక్రియ పూర్తిగా సులభమైనది, వేగవంతమైనది, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకారి. ఈ కొత్త ఫీచర్తో సేవలలో పారదర్శకత, వేగం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. పౌరులు ఎక్కడ ఉన్నా, ఎప్పుడు కావాలన్నా ప్రభుత్వ సేవలను(MeeSeva) తక్షణం పొందగలరు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >