Posted on 2025-11-18 12:05:24
డైలీ భారత్, సిద్దిపేట: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబ సభ్యులు ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం, ఆకునూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శెట్టె భాస్కర్ ఇంట్లో రోజూ వారీలా గ్యాస్ పొయ్యి వెలిగించే క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో పెద్ద శబ్దం సంభవించింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న భాస్కర్తో సహా తండ్రి అయ్యల్లం, భార్య కావ్య ముగ్గురు పిల్లలు ప్రణవి, కృతిక, హర్షిణిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >