Posted on 2025-11-02 17:14:59
నడి చౌరస్తాపై విద్యార్థినులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం
విద్యార్థినిపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్
మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టి ఈడ్చుకుని కొట్టిన విద్యార్థినిలు
విద్యార్థినీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలింపు
డైలీ భారత్, రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కమ్మదనం వద్ద ఓ భవనంలో కొనసాగుతున్న ఈ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ప్రిన్సిపల్ అక్రమాలు వేధింపులపై గళం ఎత్తి మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆదివారం కావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున కళాశాల భవనం నుండి రోడ్లపైకి వచ్చారు. అయితే ఈ క్రమంలో పట్టణ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థినిలు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమింప చేయడానికి బలవంతంగా విద్యార్థినీలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థినిలతో ఓ మహిళా కానిస్టేబుల్ వాగ్వివాదానికి దిగారు. ఇంతలో ఓ విద్యార్థినిపై చేయి చేసుకోవడం చూసి మిగతా విద్యార్థులు ఆగ్రహానికి గురై తమనె కొడతారా అంటూ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకుని చితకబాదారు. ఈ ఘటనకు అందరూ నిశ్చేస్తులై పోయారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వస్తే మమ్మల్ని కొడతారా అంటూ విద్యార్థులు నిలదీశారు. ఒకరిపై చేయి చేసుకున్న ఎవరిని విడిచిపెట్టబోమని విద్యార్థినిలు తీవ్రంగా పోలీసులను హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థినిలను బలవంతంగా కొంతమందిని పోలీసు వాహనంలోకించుకొని వెళ్లిపోయారు. మహిళా సిబ్బంది సరిగ్గా సంఖ్య లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి..
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >