Posted on 2025-10-31 16:05:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం జెండాల సెంటర్ ఏరియా కు చెందిన గడ్డం శ్రీనివాసరావు తండ్రి రాజారామ్ లేటు 2013 వ్యక్తి పై అటెంప్ట్ మర్డర్ కేసు Cr.No 126/2013 Us 294(b),307 IPC గా నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసులో గడ్డం శ్రీనివాసరావు కి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించగా ముద్దాయి గడ్డం శ్రీనివాసరావు బెయిలు పై జైలు నుండి విడుదలై కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా సమాచార నిమిత్తం పోలీసు తప్పించుకొని తిరుగుతూ ఉండడంతో కొత్తగూడెం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ముద్దాయి శ్రీనివాసరావు పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. కోర్టు వారి ఆదేశాలపై సుజాతనగర్ SI రమాదేవి సుజాతనగర్ పోలీస్ సిబ్బందితో కలిసి ముద్దాయి గడ్డం శ్రీనివాసరావును అతని ఇంటి వద్ద పట్టుకొని అదుపులోకి తీసుకొని అతనిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోర్టు వారి ముందు హాజరుపరచగా కొత్తగూడెం కోర్టు వారు అతనికి రిమాండ్ విధించగా గడ్డం శ్రీనివాస్ రావు సుజాతనగర్ పోలీస్ భద్రాచలం సబ్ జైలు కు తీసుకెళ్లి అప్పగించారు. ఈ విధంగా ఎవరైనా కేసులలో ఉన్న వారు కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా పోలీసు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నట్లయితే కోర్టు నుండి అరెస్టు వారెంట్ వారిని తీసుకొని వారిని రిమాండ్ చేయడం జరుగుతుంది సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి తెలిపినారు ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >