| Daily భారత్
Logo




నేటి నుండి మండలాలలో అంబులెన్స్ సేవలు : షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

News

Posted on 2025-10-31 11:56:45

Share: Share


నేటి నుండి మండలాలలో అంబులెన్స్ సేవలు : షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

మండలాల బాధ్యులకు అంబులెన్స్ లను అప్పజెప్పిన ఎమ్మెల్యే

డైలీ భారత్, షాద్ నగర్ :షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు కేశంపేట నందిగామ ఉమ్మడి మండలాలకు ఒక్కో అంబులెన్స్ చొప్పున లిమ్స్ శంషాబాద్ ఆసుపత్రి వారి సౌజన్యంతో నేటినుండి సేవలు అందుబాటులోకి వచ్చాయని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా మండలాల అంబులెన్స్ బాధ్యులకు వాటిని అప్పచెప్పారు. ఇటీవల విజయదశమి పండుగ రోజున అంబులెన్స్లను నూతనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ దానికి సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి శిక్షణను అందజేసి నేడు పూర్తిస్థాయిలో మండలాలకు సేవల కోసం వారికి స్వాధీన పరిచినట్లు ఎమ్మెల్యే చెప్పారు. శంషాబాద్ లిమ్స్ ఆస్పత్రి యజమాని రామరాజు సహకారంతో ఈ అంబులెన్స్ సేవలను పేద ప్రజలకు ఉచితంగా పెట్టేందుకు ముందుకు రావడం విశేషమని తెలిపారు. తన రాజకీయ అభివృద్ధి తో పాటు అనేక అంశాల్లో సహకరిస్తూ నియోజకవర్గ ప్రజలకు తమ వంతు సహకారం అందించే విధంగా అంబులెన్స్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పేదవాడు ఈ అంబులెన్స్ సేవలను ఉచితంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆగిర్యల కృష్ణ రెడ్డి, చెంది తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  చల్ల శ్రీకాంత్ రెడ్డి, జంగ నర్సింహులు, హరినాథ్ రెడ్డి, గూడ విరెష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి వెంకట్ రాంరెడ్డి, కొత్తూరు కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నేతలు అగ్గనుర్ బస్వం, సురేష్ రెడ్డి, జాకరం చంద్ర శేఖర్, యెన్నం శ్రీధర్ రెడ్డి , గిరి యాదవ్, చంద్ర పాల్ రెడ్డి, కొప్పునుర్ ప్రవీణ్ త్రిప్పిశెట్టి కర్ణకర్, కొమ్ము కృష్ణ, బాధేపల్లి సిద్దార్థ, జాంగారి రవి, హైదర్ ఘోరీ, నెహ్రూ నాయక్, రాజు నాయక్, సుమన్ నాయక్, అన్వర్, అప్పరెడ్డిగూడ మల్లేష్,భాస్కర్ గౌడ్, లింగారెడ్డి గూడ అశోక్, ఖదీర్,సీతారాం, సుఖ్య నాయక్, రాందాస్ నాయక్, బసప్పా, నాగి సాయిలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-26 10:43:36

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-26 08:13:24

Readmore >
Image 1

జీవ నదులను కాపాడుకోకపోతే భవిష్యత్తే ఉండదు : పవన్ కళ్యాణ్

Posted On 2026-05-26 07:43:54

Readmore >
Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >