Posted on 2025-10-28 14:40:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని మర్రిగూడెం గ్రామ శివారులో పశువుల అక్రమ రవాణా చేస్తూ కబేళాలకు ఇతర ప్రాంతాలకు పంపించే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయసింహారెడ్డి టాటా ఏసీ మినీ ట్రక్కు లో పశువుల ఆక్రమ కళేబరాలు రవాణా చేస్తున్న స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు అన్నపురెడ్డిపల్లి మండలంలోని పరిసర గ్రామాలలో ఆవులను దూడలను రైతుల దగ్గర తక్కువ ధరకు కొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరువూరు సంతలో హైదరాబాదులోని కబేలాలకు సంబంధించిన వ్యాపారులకు అధిక ధరలకు అమ్మటానికి టాటా ఏసీ మినీ ట్రక్ లో తరలిస్తుండగా మర్రిగూడెం గ్రామ శివారులో అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయసింహారెడ్డి ముగ్గురు వ్యక్తులను వాహనమును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఇటువంటి సమాచారం ఉన్న 100 కి డయల్ లేదా87126 82045 కంట్రోల్ రూమ్ పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >