| Daily భారత్
Logo




వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి : సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

News

Posted on 2025-10-28 11:59:12

Share: Share


వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి : సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి 

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సిపిఐ(ఎం) వినతి 

నిధులు కేటాయించి సమస్యల పరిష్కారానికి కృషి పరిష్కారం చేస్తాం.

వైరా ఎమ్మెల్యే మాలోత్  రాందాస్ నాయక్ హామీ. 

డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుత పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కోసం వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలని, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌళిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు. మంగళవారం సిపిఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను పరిష్కరించాలి కోరుతూ  స్థానిక వైరా ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను ప్రభుత్వం బలోపేతం చేయాలని, నిరుపేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలి అన్నారు. సిపిఐ(ఎం) బృందం వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులు, అధ్యాపకులతో చర్చించి గుర్తించిన ప్రధానమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. శిధిలవ్యవస్థలో ఉన్న పాత భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని, ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేసిన 3.5 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని,  విద్యార్థులకు లైబ్రరీ ఏర్పాటు చేయాలని, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మంజూరు చేసిన 25 లక్షల నిధులను వెంటనే విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని,  ఫిజికల్ డైరెక్టర్ పోస్టును భర్తీ చేయాలని, బాలబాలికలకు ఎస్ఎం హాస్టల్ స్వంత భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు మరుగుదొడ్లను నిర్మించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ మంజూరు చేయాలని, వైరా నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని, సైన్స్ విద్యార్ధులకు ల్యాబ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు గేమ్స్ మెటీరియల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సిపిఐ(ఎం) వినతికి స్పందించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలను ముఖ్యమంత్రి,  ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయింపు చేయించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, డివిజన్ కమిటీ సభ్యులు తుము సుధాకర్,వైరా పట్టణ నాయకులు కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >