| Daily భారత్
Logo




కేటీఆర్ మొదలు కుటుంబ తగాదాలు సరిదిద్దుకో..

News

Posted on 2025-10-23 20:37:17

Share: Share


కేటీఆర్ మొదలు కుటుంబ తగాదాలు సరిదిద్దుకో..

అది కాకుండా ఇతర పార్టీలపై విమర్శలు చేయడం మీ అవివేకానికి నిదర్శనం

ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు.. జాగృతి అధ్యక్షురాలు కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ నీచ  రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్​, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్​ అధికారంలోకి ఎన్నో కార్యక్రమాలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. కానీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై కేటీఆర్​ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి కేటీఆర్​వి అర్థం లేని  ఆరోపణలని కొట్టిపడేశారు. ఆయన గురువారం నిజామాబాద్​లో విలేకరులతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ను తెలంగాణ ప్రజలు దూరం పెట్టారన్నారు. పదేళ్ల బీఆర్​ఎస్​ నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ పార్టీని భవిష్యత్తులోనూ ఆదరించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కుటుంబంలోని తగాదాలను పరిష్కరించుకోలేని కేటీఆర్​ కాంగ్రెస్​పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నీచ  రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్​ కాంగ్రెస్​దే విజయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలువబోతోందని పీసీసీ చీఫ్​ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన పనులపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారన్నారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాదయాత్రపై మహేశ్​ కుమార్​ గౌడ్​ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్రను చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా దోచుకుందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్​ జవాబు చెప్పాలని ప్రశ్నించారు. అయితే.. గత పదేళ్లలో తెలంగాణాను దోచుకున్న ముఠాలో కవిత సభ్యురాలు కాదా చెప్పాలన్నారు.

Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 11:51:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >