| Daily భారత్
Logo




కేటీఆర్ మొదలు కుటుంబ తగాదాలు సరిదిద్దుకో..

News

Posted on 2025-10-23 20:37:17

Share: Share


కేటీఆర్ మొదలు కుటుంబ తగాదాలు సరిదిద్దుకో..

అది కాకుండా ఇతర పార్టీలపై విమర్శలు చేయడం మీ అవివేకానికి నిదర్శనం

ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు.. జాగృతి అధ్యక్షురాలు కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ నీచ  రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్​, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్​ అధికారంలోకి ఎన్నో కార్యక్రమాలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. కానీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై కేటీఆర్​ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి కేటీఆర్​వి అర్థం లేని  ఆరోపణలని కొట్టిపడేశారు. ఆయన గురువారం నిజామాబాద్​లో విలేకరులతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ను తెలంగాణ ప్రజలు దూరం పెట్టారన్నారు. పదేళ్ల బీఆర్​ఎస్​ నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ పార్టీని భవిష్యత్తులోనూ ఆదరించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కుటుంబంలోని తగాదాలను పరిష్కరించుకోలేని కేటీఆర్​ కాంగ్రెస్​పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నీచ  రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్​ కాంగ్రెస్​దే విజయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలువబోతోందని పీసీసీ చీఫ్​ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన పనులపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారన్నారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాదయాత్రపై మహేశ్​ కుమార్​ గౌడ్​ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్రను చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా దోచుకుందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్​ జవాబు చెప్పాలని ప్రశ్నించారు. అయితే.. గత పదేళ్లలో తెలంగాణాను దోచుకున్న ముఠాలో కవిత సభ్యురాలు కాదా చెప్పాలన్నారు.

Image 1

బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్

Posted On 2026-05-12 06:24:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త

Posted On 2026-05-11 21:14:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

Posted On 2026-05-11 21:12:14

Readmore >
Image 1

నకిలీ నంబర్ ప్లేట్ వినియోగించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు

Posted On 2026-05-11 21:02:02

Readmore >
Image 1

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి

Posted On 2026-05-11 20:55:26

Readmore >
Image 1

మతసామరస్యాన్ని కాపాడేలా పండుగల నిర్వహణ చేపట్టాలి : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-05-11 20:42:59

Readmore >
Image 1

రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

Posted On 2026-05-11 20:38:54

Readmore >
Image 1

ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ

Posted On 2026-05-11 20:36:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణి లో 111 దరఖాస్తులు

Posted On 2026-05-11 20:35:56

Readmore >
Image 1

భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు

Posted On 2026-05-11 19:52:59

Readmore >