Posted on 2025-10-15 16:25:23
రైలు కిందపడి ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య
జిల్లాలో వరుసగా ఆత్మహత్య ఘటనలు..
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..
ఉలిక్కిపడ్డ ఉమ్మడి జిల్లా వాసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆత్మహత్యలు చేసుకోవడమే అన్నిటికీ పరిష్కారమా.. ఆత్మహత్యలు చేసుకునే వారు వారు ఆ ఘటనకు పాల్పడే ముందు ఓ క్షణం తన కుటుంబం భార్య పిల్లల గురించి సమాజం గురించి ఆలోచించాలి. కానీ బుధవారం నిజామాబాద్ లో మూడు ప్రాణాలు కొద్దిపాటి ఆవేశంతో అనంత లోకాలకు వెళ్లాయి. నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు వివిధ కారణాలతో వివిధ ఘటనలు వేరువేరుగా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. బుధవారం ఒకేరోజు ముగ్గురు వేరే వేరే ఘటనలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన జిల్లా వాసులను కలవరపరుస్తుంది. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ అనారోగ్య సమస్యలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. బుధవారం ఉదయం నుంచి జిల్లా కేంద్రంలో ఆత్మహత్య గతంలో ఒకదాని వెనుక ఒకటి జరుగుతూనే ఉన్నాయి . ఉదయం గాయత్రి నగర్ కు చెందిన మోత్కూరి కిషన్ అనే యువకుడు కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, అది మరవక ముందే శివాజీ నగర్ కు చెందిన ఓ కుటుంబం కుటుంబ కలహాలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకుశివాజీ నగర్ కు చెందిన ఓ కుటుంబం కుటుంబ కలహాలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుటుంబ పెద్ద దాసరి కిషన్ మృతి చెందగా మిగతావారు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషయమునంఆరోగ్య పరిస్థితి పూర్తి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ లో మెరుగైన చికిత్స నిమిత్తం వారి బంధువులు తరలించారు. ఈ ఘటన మరువకముందే మళ్లీ రైలు కిందపడి ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకుందని రైల్వే ఎస్సై సాయి రెడ్డి బుధవారం తెలిపారు. దుబ్బా ప్రాంతానికి చెందిన మీరా అను (ట్రాన్స్ జెండర్) అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. నిజామాబాద్-జానకంపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఇది ఇలాగ ఉంటే కామారెడ్డి జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కలవరపరుస్తుంది.
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >