Posted on 2025-10-10 18:07:47
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఓదార్చిన ముఖ్యమంత్రి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ గత నెల 29న మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలో తలపెట్టిన తన తల్లి ద్వాదశదినకర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీనరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేను పరామర్శించి ఓదార్చారు. తన తల్లి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరని ఎందరు ఉన్న ఎంత ఆస్తులు అధికారం పదవులు ఉన్న తల్లి లేకపోతే ఆ మనోవేదన ఏంటో అనుభవించిన వారికి తెలుసు అని ముఖ్యమంత్రి అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీమంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హుందాన్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ సునీల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నూఢ చైర్మన్ కేశవేణు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >