Posted on 2024-01-02 16:42:43
కార్మికులకు రావలసిన బకాయి వేతనాలు వెంటనే అందించాలి
డైలీ భారత్, సిరిసిల్ల : ఈరోజు డివైడర్ పార్కులో పనిచేసే కార్మికులకు వెంటనే పని కల్పించాలని వారికి రావలసిన 5 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ముశం రమేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి సిరిసిల్ల పట్టణంలో గల పార్కులు డివైడర్లలో శానిటేషన్ పనిచేస్తున్న 50 మంది కార్మికులు పార్కులు డివైడర్లు పనిచేసే కాంట్రాక్టు తీసుకున్న వారి కాంట్రాక్టు గత నెల డిసెంబర్ 11 వరకు అయిపోవడం జరిగిందని తర్వాత మళ్లీ టెండర్ మున్సిపల్ అధికారులు వెయ్యకపోవడం వలన కాంట్రాక్టర్ కార్మికులను పనిచేయవద్దని చెప్పడం జరిగిందన్నారు దానితో 15 రోజుల నుండి కార్మికులు పని లేకుండా ఉంటున్నారని దానికి తోడు వారికి రావలసినటువంటి ఐదు నెలల వేతనాలు రాకపోవడం వలన ఒకపక్క పని లేక మరోపక్క చేసిన పనికి వేతనం రాకా కార్మికులు వారి కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొన్నదని ఇప్పటికే ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చిన కూడా సమస్య పరిష్కారం చేయడం లేదన్నారు వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మళ్లీ డివైడర్లు పార్కులకు కొత్త టెండర్లు వేయించి కార్మికులకు ఉపాధి కల్పించాలని అదేవిధంగా బకాయి వేతనాలను ఇప్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నర్సయ్య , శారద , రమణమ్మ , గీత , వసంత , మణెమ్మ , లక్ష్మి , శ్రీకాంత్ , రాకేష్ , వంశీ , కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >