Posted on 2025-09-27 14:18:39
వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని జెడ్.పి.టి.సి, ఎం పి.పి స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ రిజర్వేషన్ లు ఖరారు చేయడం జరిగిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్ లో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, డిప్యూటీ సీ.ఈ.ఓ సాయన్నలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 31 జెడ్.పి.టి.సి, ఎం పి.పి స్థానాల కోసం ఎస్.సి, ఎస్.టి, బి.సి, జనరల్ రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్యన, నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్.సి, ఎస్.టి రిజర్వేషన్లు, బీ.సీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా బి.సి రిజర్వేషన్ కేటాయింపులు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని మొత్తం 31 జెడ్.పి.టి.సి స్థానాలకు గాను ఎస్.టిలకు 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయని, అందులో ఒకటి మహిళకు రిజర్వ్ అయ్యిందని కలెక్టర్ తెలిపారు. ఎస్.సి లకు 5 జెడ్.పీ.టీ.సి స్థానాలు రిజర్వ్ కాగా, మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు. బీ.సి లకు 13 స్థానాలు రిజర్వ్ కాగా, వీటిలో 6 స్థానాలు మహిళలకు కేటాయించబడినాయని తెలిపారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని వివరించారు. అదేవిధంగా జిల్లాలోని 31 ఎం.పీ.పీ స్థానాలకు గాను ఎస్.టిలకు 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయని, అందులో ఒకటి మహిళకు రిజర్వ్ అయ్యిందని కలెక్టర్ తెలిపారు. ఎస్.సి లకు 5 ఎం.పీ.పీ స్థానాలు రిజర్వ్ కాగా, మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు. బీ.సి లకు 13 స్థానాలు రిజర్వ్ కాగా, వీటిలో 6 స్థానాలు మహిళలకు కేటాయించబడినాయని తెలిపారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరుగుతుందని తెలిపారు.
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >