| Daily భారత్
Logo




జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు

News

Posted on 2025-09-27 17:48:39

Share: Share


జిల్లాలో ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానాలకు రిజర్వేషన్ల ఖరారు

వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని జెడ్.పి.టి.సి, ఎం పి.పి స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ రిజర్వేషన్ లు ఖరారు చేయడం జరిగిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్ లో అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, డిప్యూటీ సీ.ఈ.ఓ సాయన్నలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 31 జెడ్.పి.టి.సి, ఎం పి.పి స్థానాల కోసం ఎస్.సి, ఎస్.టి, బి.సి, జనరల్ రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్యన, నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్.సి, ఎస్.టి రిజర్వేషన్లు, బీ.సీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా బి.సి రిజర్వేషన్ కేటాయింపులు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని మొత్తం 31 జెడ్.పి.టి.సి స్థానాలకు గాను ఎస్.టిలకు 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయని, అందులో ఒకటి మహిళకు రిజర్వ్ అయ్యిందని కలెక్టర్ తెలిపారు. ఎస్.సి లకు 5 జెడ్.పీ.టీ.సి స్థానాలు రిజర్వ్ కాగా, మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు. బీ.సి లకు 13 స్థానాలు రిజర్వ్ కాగా, వీటిలో 6 స్థానాలు మహిళలకు కేటాయించబడినాయని తెలిపారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని వివరించారు. అదేవిధంగా జిల్లాలోని 31 ఎం.పీ.పీ స్థానాలకు గాను ఎస్.టిలకు 3 స్థానాలు రిజర్వ్ అయ్యాయని, అందులో ఒకటి మహిళకు రిజర్వ్ అయ్యిందని కలెక్టర్ తెలిపారు. ఎస్.సి లకు 5 ఎం.పీ.పీ స్థానాలు రిజర్వ్ కాగా, మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు. బీ.సి లకు 13 స్థానాలు రిజర్వ్ కాగా, వీటిలో 6 స్థానాలు మహిళలకు కేటాయించబడినాయని తెలిపారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు. మిగతా 10 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 5 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరుగుతుందని తెలిపారు.

Image 1

ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

Posted On 2026-04-22 22:58:48

Readmore >
Image 1

ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో అక్రమాల ఆరోపణలు

Posted On 2026-04-22 22:55:13

Readmore >
Image 1

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

Posted On 2026-04-22 20:13:36

Readmore >
Image 1

మురికికాలువ త్రవ్వేసి మధురానగర్ రోడ్డు కబ్జా?

Posted On 2026-04-22 20:10:32

Readmore >
Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >