Posted on 2025-09-26 14:13:01
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ప్రముఖ సమాజసేవకుడు కాటేగర్ శంకరరావు కు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవా పురస్కారం లభించనుంది. ఈ పురస్కారం అఖిలభారత పద్మశాలి సంక్షేమ సంఘం స్థాపించబడింది. ఈనెల సెప్టెంబర్ 27న తెలంగాణ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, కేంద్ర గ్రంథాలయ అధ్యక్షులు డా.రియాజ్ అలీ, పద్మశ్రీ డా.కొలకలూరి ఇనాక్ ల చేతుల మీదుగా ప్రదానం కానుంది. ఈ కార్యక్రమంలో కవి సమ్మేళనం నిర్వహించబడును.
శంకరరావు 40 ఏళ్లకు పైగా సమాజసేవలో అహర్నిశలు కృషి చేశారు. సహస్త్ర అర్జున క్షేత్రీయ (ఎస్ఎస్కే) కార్యదర్శిగా పనిచేస్తూ, వేలాది ఉచిత వివాహాలు నిర్వహించారు. మహిళా కళాశాలలు, హైస్కూలులు స్థాపించి వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య అందించారు. ఆర్థిక సహకార మండలి ద్వారా వెనుకబడిన కుటుంబాలకు రుణాలు అందించి, వారిని ఆర్థికంగా అభివృద్ధి దిశగా నడిపించారు.
తెలంగాణ ఉద్యమం రెండు దశల్లోనూ చురుకుగా పాల్గొన్న ఆయన సేవలను గుర్తించి ఈ గౌరవం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు తుమ్మ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సూరేపల్లి రవికుమార్ మాట్లాడుతూ, “శంకరరావు సేవలు సమాజానికి గర్వకారణం అని భవిష్యత్తులో మరిన్ని గౌరవాలు లభించాలని ఆశిస్తున్నామని తెలిపారు.
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
Posted On 2026-07-28 08:06:38
Readmore >
అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు
Posted On 2026-07-28 08:04:20
Readmore >
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >