శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున హాజరైన భక్తులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగర శివారులోని ముబారక్ నగర్ లో గల శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. తెల్లవారుజామున నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అర్చన కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. ఐదవ రోజు కావడంతో అమ్మవారు స్కందమాత అవతారంగా వెలిశారు. ఇదిలా ఉండగా కే6, జిటిపిఎల్, రోషిని, చానల్స్, సామా బ్రాడ్బండ్ సామా బ్రాడ్ బాండ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నెట్వర్క్ ఆధ్వర్యంలో సామ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం దుర్గామాత మాల వేసుకున్న భక్తులకు, పలు ప్రాంతాల నుండి వచ్చిన వేలాదిమంది భక్తులకు మా అన్నదాన ప్రసాదల వితరణ కార్యక్రమం నిర్వహించారు.