Posted on 2025-09-25 18:57:42
తీరోక్క పూలను పేర్చి మహిళా మణులతో ఆడి పాడిన సంధ్యారాణి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ లో కౌండిన్య మహిళా గౌడ సంఘం, పట్టణ గౌడ సంఘం 1 సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గౌడ కళ్యాణ వేడుకలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంబరాలకు ముఖ్యఅతిథిగా పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి ముఖ్యఅతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. చిత్తూ చిత్తూల గుమ్మ.. శివుని ముద్దుల గుమ్మ అంటూ బతుకమ్మ పాటలను అనుకరిస్తూ మహిళల్లో జోష్ నింపారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అట్ల బతుకమ్మ రోజున గౌడ మహిళా సోదరీమణులతో కలిసి బతుకమ్మ పండుగను ఆడడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగను అలాగే వచ్చే దసరా పండుగను సుఖ సంతోషాల నడుమ జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లాలో గౌడ సంఘం నుంచి మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగను ఎంతో ఆర్భాటంగా మహిళలను గౌరవ పరుస్తూ బతుకమ్మ పండగ అధికారకంగా ఆడేందుకు సిద్ధంగా ఉందన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >