| Daily భారత్
Logo




ఎన్ హెచ్ 44 రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

News

Posted on 2025-09-25 10:21:42

Share: Share


ఎన్ హెచ్ 44 రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు

8 మందికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలింపు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్​పల్లి మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబర్​ జాతీయ రహదారి 44 పై ఆగి ఉన్న లారీని ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. నిర్మల్​ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సు సుద్దపల్లి సమీపంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్​ అజాగ్రత్త నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉండగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న డిచ్పల్లి ఎస్సై షరీఫ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్​లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన్నట్లు ఎస్సై తెలిపారు.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >