Posted on 2025-09-22 19:42:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాదు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో దుర్గా పరమేశ్వరి మాత మందిరము లో ఏర్పాటుచేసిన నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ సందర్భంగా దుర్గా దేవి అమ్మవారి పూజా కార్యక్రమంలో సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా దేవీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాల మొదటి దినం - బాల త్రిపుర సుందరి అలంకరణ సందర్భంగా " నవరాత్రులు నూతన శక్తి , భక్తి , విజయానికి ప్రతీకలు. ఈ పవిత్రమైన రోజు సందర్బంగా బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికి దైవానుగ్రహంగా భావించగలము అని అన్నారు. ఈ ఉత్సవాలు సమాజంలో శాంతి , సమరసత , సద్భావనలకు దోహదపడతాయని ఆశిస్తున్నాను అని అన్నారు. ప్రతి ఒక్కరికీ మాత అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూనట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో అదనపు డిసిపి ( అడ్మిన్ ) బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ( అడ్మిన్ ), ఎంటిఓ శేఖర్ బాబు ( ఎం టీ ఓ ), తిరుపతి ( వెల్ఫేర్ ), సతీష్ ( హోమ్ గార్డ్స్ ) దుర్గా పరమేశ్వరి మాత మందిరం ఆర్గనైజర్స్ సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది , స్పెషల్ పార్టీ సిబ్బంది , ప్రధాన అర్చకులు జోషి వెంకటేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >