Posted on 2025-09-10 15:26:46
కిచెన్ లో అపరిశుభ్రత దుర్వాసన వెదజల్లటంతో నిర్వహకులపై అసహనం వ్యక్తం చేసిన అధికారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గత రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వేణు మాల్ లో కుళ్లిపోయిన చికెన్ వచ్చిందంటూ ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా కేఎఫ్లో సి తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ గెజిటెడ్ ఇన్స్పెక్టర్ సునీత, ఫుడ్ సేఫ్టీ అధికారిని నివిత, విక్రమ్ లు మున్సిపల్ అధికారులు ఎం ఎచ్ ఓ, ఇతర అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీలలో ఊహించని విషయాలు బయటపడ్డాయని ఆమె వెల్లడించారు. కిచెన్ హాల్ బూజు పట్టి ఉండడం, అలాగే కిచెన్లో దుర్వాసన వెదజల్లటం, ఆహార పదార్థాలపై దుర్వాసన రావడంని గమనించడం జరిగిందని, దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్సి నిర్వహకులపై అసహనం వ్యక్తం చేశారు. కొన్ని అపరిశుభ్రంగా ఉన్న శాంపిల్స్ ను ల్యాబ్ కు తరలించడం జరుగుతుందని ఫుడ్ సేఫ్టీ గెజిటెడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ సునీత వివరించారు. అలాగే కిచెన్లో అపరిశుభ్రత వాతావరణం, డ్రైనేజ్ బ్లాక్, చెడు దుర్వాసన లాంటివి విడుదల వెదజల్లుతుందని ఇందుకోసం కెఎఫ్సి నిర్వాహకులకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు అలాగే కస్టమర్లకు ఇచ్చే లెగ్ పీస్ లో సగం ఉడికి ఉడికనట్టుగా ఉన్న లెగ్ పీస్ ని కూడా ల్యాబ్కు తరలించడం జరుగుతుందని 15 రోజుల్లోగా పూర్తి వివరణ కెఎఫ్సి నిర్వహకులు ఈ విషయంపై తమకు పూర్తి నివేదిక అందజేయాలని లేనియెడల తదుపరి చర్యలు తప్పవని హెచ్చరించారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >