| Daily భారత్
Logo




వైరా వ్యవసాయ మార్కెట్ లో మార్క్ ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు చేయాలి

News

Posted on 2025-09-03 09:57:52

Share: Share


వైరా వ్యవసాయ మార్కెట్ లో మార్క్ ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు చేయాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,పట్టణ కార్యదర్శి చింత నిప్పు  చలపతిరావు 

డైలీ భారత్, వైరా:  ఖమ్మం జిల్లాలో మార్క్ ఫెడ్  ద్వారా పెసలు కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పట్టణ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు డిమాండ్ చేశారు.వైరా వ్యవసాయ మార్కెట్లో తెలంగాణ రైతు సంఘం బృందం   వ్యవసాయ మార్కెట్ ఆవరణ లో ఉంచిన పెసలు ను రైతులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,పట్టణ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు మాట్లాడుతూ ఆగస్టు రెండో వారం నుంచి కురిసిన వర్షాలకు ఖరీఫ్ సీజన్లో వందలాది ఎకరాల్లో పెసర పంట కోయకుండా పోయింది అని, అరకోర గా రైతులు చేతికి వచ్చిన పెసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు మార్క్ ఫెడ్ చేయకపోవడం వల్ల  ప్రవేట్ వ్యాపారులు క్వింటాలకు రూ 4 వేల నుంచి 5 వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రం ప్రారంభమైతే కనీసం మద్దతు ధర క్వింటాలకు 8800 రైతులకు లభించే అవకాశం ఉందని వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలని కోరారు అదేవిధంగా  కోతకు పనికి రాకుండా పోయిన పెసర పంట కు  నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు హరి వెంకటేశ్వరరావు, సంక్రాంతి నర్సయ్య, కొల్లి నరసింహారావు,కొమ్మురి శ్రీనివాసరావు, జాలాది గోపాల్ రావు, కామినేని రవి,చిత్తారు మురళి, యనమద్ది రామకృష్ణ, గౌస్  తదితరులు పాల్గొన్నారు

Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >