Posted on 2025-08-06 20:24:18
డైలీ భారత్, వేములవాడ: బ్రాండెడ్ మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ మద్యాన్ని నింపి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను వేములవాడ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రాజశేఖర్ రావు పూర్తి వివరాలు వెల్లడించారు. వేములవాడ అర్బన్ మండలం లో రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన తునికి కార్తీక్ అనే యువకుడు బ్లాక్ అండ్ వైట్, విలియమ్స్ , బ్లాక్ డాగ్, రెడ్ లేబుల్, సిగ్నేచర్ వంటి బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఖాళీ మద్యం సీసాలను సేకరించి వాటిలో చీప్ లిక్కర్ మద్యాన్ని నింపి స్థానికంగా విక్రయాలు జరుపుతున్నాడు. ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం కార్తీక్ ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా అక్కడ ఖాళీ నీళ్ల సీసాలలో నింపిన మద్యంతో పాటు పాటు బ్రాండెడ్ సీసాల్లో నింపిన మద్యం లభ్యమైంది.
అనంతరం కార్తీక్ ని విచారించగా వేములవాడ పట్టణానికి చెందిన దామరపల్లి సంతోష్ అనే మరో యువకుడి సాయంతో గత 6 నెలలుగా ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఇరువురిని అదుపులోకి తీసుకొని కార్తీక్ వద్ద నుండి 9 రెండు లీటర్ల వాటర్ బాటిల్స్, 9 ఒక లీటర్ వాటర్ బాటిల్స్, 3 సిగ్నేచర్ బాటిల్స్ లోని మద్యాన్ని, అట్లాగే సంతోష్ వద్ద నుండి 750 మిల్లీ లీటర్ల పరిణామంతో కూడిన 3 సిగ్నేచర్ బాటిల్స్, 3 విలియమ్స్ బాటిల్స్, ఐ.బి, ఆర్.సి రెడ్, రాయల్ గ్రీన్ బాటిల్స్ ఒక్కొక్కటి, అర్థ లీటర్ ఆర్.సి రెడ్ బాటిల్ ఒక్కటి స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ సుమారు 50 వేల వరకు ఉంటుందని, గత 6 నెలలుగా వీరు సుమారు 2 లక్షల వరకు వ్యాపార లావాదేవీలు కొనసాగించినట్లు ప్రాథమిక అంచనా వేసి, తదుపరి చర్యల నిమిత్తం ఇద్దరిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రవి, టాస్క్ ఫోర్స్ ఎస్సై శైలజ, కానిస్టేబుల్ రాజు, యుగేందర్, సాయి కృష్ణ, శ్రీనివాస్, రాకేష్, సంజీవ్, స్రవంతి, లత తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >