| Daily భారత్
Logo




బంజారా సామాజిక ప్రజల హక్కుల సాధనకే ఏ ఐ బి ఎస్ ఎస్ ఏస్ ఏర్పాటు

News

Posted on 2025-07-27 16:54:55

Share: Share


బంజారా సామాజిక ప్రజల హక్కుల సాధనకే ఏ ఐ బి ఎస్ ఎస్ ఏస్ ఏర్పాటు

బంజారా ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య వక్తలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బంజారా సామాజిక వర్గానికి చెందిన ప్రజల హక్కులు, మరియు వారికి వారికి సామాజిక న్యాయం కల్పించడం కోసమే అఖిల భారతీయ బంజారాసేవా సంఘ్ ఏర్పాటయిందని మాజీ ఎంపీ ఏఐబిఎస్ ఎస్ జాతీయ అధ్యక్షులుఉమేష్ జాదవ్  మాజీ ఎమ్మెల్సీ, సబావట్ రాములు నాయక్  లు పేర్కొన్నారు. బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజల హక్కులు, సంక్షేమం, కోసం పాటుపడి వారి రాజకీయ, సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి కోసం కృషి చేసే సంస్థ అని అన్నారు. ఇది దేశ వ్యాప్తంగా బంజారాలపై జరుగుతున్న అన్యాయాన్ని, దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సంఘానికి బలోపేతం చేయడమన్నారు. జాతి ఐక్యత కోసం అహర్నిశలు శ్రమించడం, వారి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు.1952 సంవత్సరంలో అఖిల భారతీయ బంజారా సేవా సంఘం మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా డిగ్రీస్ తాలుకా లోని ఒక ప్రైవేటు వసతి గృహంలో చదువుతున్న బంజారా విద్యార్థులు కలిసి విద్యార్థి సంఘం నాయకుడైన ఆడే ప్రతాప్ సింగ్ నాయకత్వంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అఖిల భారతీయ బంజారా సేవా సంఘం 30 జనవరి 1953లో మహారాష్ట్ర లోని యవత్మాల్ జిల్లా లోని డిగ్రేశ్ తాలుకాలో దేశ నలుమూలల నుండి వచ్చిన బంజారాలు తొలిసారిగా రెండు రోజులు సెమినార్ ఏర్పాటు చేశారు. అనంతరం దేశంలోని బంజారా ప్రముఖుల సూచనలు సలహాలు పాటిస్తూ అఖిల భారతీయ బంజారా సేవా సంఘాన్ని స్థాపించారు.

ఈ సంఘానికి మహారాష్ట్ర లోని మాండ్వి గ్రామం కిన్వట్ తాలుకా నాందేడ్ జిల్లాకు చెందిన తొలి బంజారా హింగోలీ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు ఉత్తమరావు బలిరాం రాథోడ్ని సంఘం తొలి అధ్యక్షుడిగా, ఆడే ప్రతాప్ సింగ్ని ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసి నియమించారు. బంజారా సమాజ ముఖ్యులు 1952లో తొలిసారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికైన బంజారా తొలి శాసన సభ్యులు, మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి వసంత్య్రాన్ నాయిక్ అధ్యక్షతన జరిగిన సభలో తొలి బంజారా పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సింగ్ భానావత్ సలహాదారుల నాయకత్వంలో బంజారా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర అడ్వైజర్ కిషన్ సింగ్ రాథోడ్, ఉపాధ్యక్షుడు నేనావత్ శ్రీహరి నాయక్, లతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >
Image 1

మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ

Posted On 2026-04-28 22:34:17

Readmore >
Image 1

నాలుగో స్థంభానికీ తప్పని అవమానాలు..

Posted On 2026-04-28 22:32:22

Readmore >
Image 1

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్

Posted On 2026-04-28 19:43:12

Readmore >
Image 1

జిల్లా పంచాయతీ అధికారి పై ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-04-28 10:12:26

Readmore >
Image 1

హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు శిక్ష

Posted On 2026-04-28 09:48:57

Readmore >
Image 1

బైక్ తాళం కోసం స్నేహితుడి హత్య!

Posted On 2026-04-28 07:58:08

Readmore >