Posted on 2025-07-27 16:54:55
బంజారా ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య వక్తలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బంజారా సామాజిక వర్గానికి చెందిన ప్రజల హక్కులు, మరియు వారికి వారికి సామాజిక న్యాయం కల్పించడం కోసమే అఖిల భారతీయ బంజారాసేవా సంఘ్ ఏర్పాటయిందని మాజీ ఎంపీ ఏఐబిఎస్ ఎస్ జాతీయ అధ్యక్షులుఉమేష్ జాదవ్ మాజీ ఎమ్మెల్సీ, సబావట్ రాములు నాయక్ లు పేర్కొన్నారు. బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజల హక్కులు, సంక్షేమం, కోసం పాటుపడి వారి రాజకీయ, సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి కోసం కృషి చేసే సంస్థ అని అన్నారు. ఇది దేశ వ్యాప్తంగా బంజారాలపై జరుగుతున్న అన్యాయాన్ని, దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సంఘానికి బలోపేతం చేయడమన్నారు. జాతి ఐక్యత కోసం అహర్నిశలు శ్రమించడం, వారి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు.1952 సంవత్సరంలో అఖిల భారతీయ బంజారా సేవా సంఘం మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా డిగ్రీస్ తాలుకా లోని ఒక ప్రైవేటు వసతి గృహంలో చదువుతున్న బంజారా విద్యార్థులు కలిసి విద్యార్థి సంఘం నాయకుడైన ఆడే ప్రతాప్ సింగ్ నాయకత్వంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అఖిల భారతీయ బంజారా సేవా సంఘం 30 జనవరి 1953లో మహారాష్ట్ర లోని యవత్మాల్ జిల్లా లోని డిగ్రేశ్ తాలుకాలో దేశ నలుమూలల నుండి వచ్చిన బంజారాలు తొలిసారిగా రెండు రోజులు సెమినార్ ఏర్పాటు చేశారు. అనంతరం దేశంలోని బంజారా ప్రముఖుల సూచనలు సలహాలు పాటిస్తూ అఖిల భారతీయ బంజారా సేవా సంఘాన్ని స్థాపించారు.
ఈ సంఘానికి మహారాష్ట్ర లోని మాండ్వి గ్రామం కిన్వట్ తాలుకా నాందేడ్ జిల్లాకు చెందిన తొలి బంజారా హింగోలీ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు ఉత్తమరావు బలిరాం రాథోడ్ని సంఘం తొలి అధ్యక్షుడిగా, ఆడే ప్రతాప్ సింగ్ని ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసి నియమించారు. బంజారా సమాజ ముఖ్యులు 1952లో తొలిసారిగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికైన బంజారా తొలి శాసన సభ్యులు, మహారాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి వసంత్య్రాన్ నాయిక్ అధ్యక్షతన జరిగిన సభలో తొలి బంజారా పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సింగ్ భానావత్ సలహాదారుల నాయకత్వంలో బంజారా కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఏఐబిఎస్ఎస్ రాష్ట్ర అడ్వైజర్ కిషన్ సింగ్ రాథోడ్, ఉపాధ్యక్షుడు నేనావత్ శ్రీహరి నాయక్, లతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్ట్కు రూ.2 లక్షల విరాళం
Posted On 2026-03-07 07:38:45
Readmore >
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >
నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
Posted On 2026-03-06 20:09:42
Readmore >
TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ
Posted On 2026-03-06 20:04:50
Readmore >