Posted on 2025-07-22 02:40:40
మహాకవి డా. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు
హాజరై తన ఆట పాటలతో నేటి తరానికి సందేశం ఇచ్చిన గద్దర్ కూతురు వెన్నెల
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కవులు కళాకారుల సేవలు వెలకట్టలేనివని, దాశరథి జయంతిని జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డా. వెన్నెల అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు కళాకారులకు గౌరవం పెరిగిందని, దాశరథి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపనుందని ఈ సందర్భంగా వెల్లడించారు. మహాకవి డా. దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు సోమవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో దాశరథి కృష్ణమాచార్య జయంతి నిర్వహణ కమిటీ సిర్ప లింగం, దాశరథి కృష్ణమాచార్య జయంతి నిర్వహణ కమిటీ సభాధ్యక్షులు కోనేరు సాయికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం కవులు, కళాకారులు పాల్గొని దాశరథి రాసిన పాటలు, కవితలు పాడి వినిపించారు. కళాకారులను సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డా. వెన్నెల, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనకయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ప్రముఖ వైద్యురాలు డా. కవిత హాజరయ్యారు. దాశరథి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కవులు కళాకారులకు పెద్దపీట వేస్తుందన్నారు. కవులు కళాకారులు ఎక్కడైతే ప్రోత్సహించబడతారో అక్కడ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొలి దశ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లా ఖిల్లా జైలులో దాశరథి రాసిన తెలంగాణ కోటి రతనాల వీణ 1969 తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిని నింపిందని అన్నారు. దాశరథిని జైలులో బంధించిన కవిత్వం రాస్తూ, ప్రశ్నించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు కాసర్ల నరేష్ రావు, శ్రీనివాస్ ఆర్య, మద్దుకూరి సాయి బాబు, అష్ట గంగాధర్, కర్క రమేష్, సాయి లవోల, దారం పోతన్న, ఆంజనేయులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
సిరిసిల్ల : 19వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం
Posted On 2026-07-21 15:22:53
Readmore >
తిమ్మారెడ్డి గ్రామంలో ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
Posted On 2026-07-21 15:01:38
Readmore >
సిరిసిల్లలో మైనర్ బాలికపై వేధింపుల నిందితుడికి 10 ఏళ్ల జైలు, 2000 జరిమానా
Posted On 2026-07-21 14:56:26
Readmore >
నీట్ పేపర్ లీకేజీ వివాదం : ప్రధాని నివాసం ముందు ప్రతిపక్ష అగ్రనేతల ఆందోళన
Posted On 2026-07-21 13:45:51
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్లకు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చొరవ
Posted On 2026-07-21 12:52:04
Readmore >
సిక్కిం : కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
Posted On 2026-07-21 06:12:30
Readmore >
మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Posted On 2026-07-21 04:16:53
Readmore >
తరగతులకు రోజూ హాజరుకావాలి.. ప్రణాళిక ప్రకారం చదవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-20 17:26:49
Readmore >