Posted on 2025-07-20 18:40:55
పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని జాతరను తలపించిన కోట గల్లి ప్రాంతం
ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్న నూడా చైర్మన్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆషాడ మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటగల్లి ప్రాంతంలో కోట మైసమ్మ ఆలయ అధ్యక్షుడు అంతిరెడ్డి దేవేందర్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామున నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు భక్తులు నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నూడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్ లు హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు అంతిరెడ్డి దేవేందర్ మాట్లాడుతూ ఎంతో మహిమగల కోట మైసమ్మ ఆలయంలో భక్తుల కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి కెక్కారని కోట గల్లి ప్రాంతవాసులనే కాకుండా ఆ అమ్మవారు నిజామాబాద్ నగర వాసులందరిని కాపాడుతూ వస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం నూడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ తాను చిన్ననాటి నుండి ఈ అమ్మవారి మహిమను తెలుసుకుంటూ వస్తున్నానని భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ వారికి ఎలాంటి ఆపద రాకుండా ఆ అమ్మవారు తోడుగా వారికి అండగా నిలుస్తున్నారని ఇది ఎంతో గొప్ప విషయం అన్నారు.
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >