Posted on 2025-07-18 16:34:52
మొరాయించిన మాధవ్ నగర్ రైల్వే గేట్
గేట్ సగం వరకే తెరుచుకోవడంతో ఇబ్బందులకు గురైన ప్రజలు
అదే సమయంలో రైలుపట్టాల గుండా వెళ్లిన రైలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్- హైదరాబాద్ రహదారిపై మాధవ నగర్ వద్ద ఉన్న రైల్వే గేట్ మొరాయించింది. శుక్రవారం ఉదయం రైల్ గేట్ వేసి తెరిచే సమయంలో సగం వరకే తెరిచిన తర్వాత మూతపడింది. మాధవ నగర్ రైల్వే గేటు సగం వరకీ తెరుచుకొని పూర్తిస్థాయిలో గేటు పడలేదు. రైళ్లు మాత్రం అలాగే వెళ్లిపోవడం గమనార్హం. గేటు కు ఇరువైపులా వాహనదారులను సిబ్బంది నిలిపివేశారు. ప్రస్తుతం గేటు మరమ్మతులు చేస్తున్నారు. మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్త నడక నడుస్తుండగానే ఈ ఘటనలు చోటు చేసు కొంటు న్నాయి. ఈ నేపథ్యంలో భారీ వాహనాలను దారి మళ్లించడం ఇబ్బందికరంగా మారింది. అయితే గత కొన్ని నెలలుగా ఈ రైల్వే గేట్ మరమ్మతు పనులు కొనసాగుతున్న ఇంతవరకు పూర్తి కాకపోవడంతో నిజామాబాద్ నగరం నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా అదే రూట్ లో రైలు రావడంతో షాక్ కు గురయ్యారు. అదే సమయంలో రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >