Posted on 2025-07-18 16:34:52
మొరాయించిన మాధవ్ నగర్ రైల్వే గేట్
గేట్ సగం వరకే తెరుచుకోవడంతో ఇబ్బందులకు గురైన ప్రజలు
అదే సమయంలో రైలుపట్టాల గుండా వెళ్లిన రైలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్- హైదరాబాద్ రహదారిపై మాధవ నగర్ వద్ద ఉన్న రైల్వే గేట్ మొరాయించింది. శుక్రవారం ఉదయం రైల్ గేట్ వేసి తెరిచే సమయంలో సగం వరకే తెరిచిన తర్వాత మూతపడింది. మాధవ నగర్ రైల్వే గేటు సగం వరకీ తెరుచుకొని పూర్తిస్థాయిలో గేటు పడలేదు. రైళ్లు మాత్రం అలాగే వెళ్లిపోవడం గమనార్హం. గేటు కు ఇరువైపులా వాహనదారులను సిబ్బంది నిలిపివేశారు. ప్రస్తుతం గేటు మరమ్మతులు చేస్తున్నారు. మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్త నడక నడుస్తుండగానే ఈ ఘటనలు చోటు చేసు కొంటు న్నాయి. ఈ నేపథ్యంలో భారీ వాహనాలను దారి మళ్లించడం ఇబ్బందికరంగా మారింది. అయితే గత కొన్ని నెలలుగా ఈ రైల్వే గేట్ మరమ్మతు పనులు కొనసాగుతున్న ఇంతవరకు పూర్తి కాకపోవడంతో నిజామాబాద్ నగరం నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా అదే రూట్ లో రైలు రావడంతో షాక్ కు గురయ్యారు. అదే సమయంలో రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >