Posted on 2025-07-17 16:25:08
డైలీ భారత్, తిరుపతి:తిరుపతి జిల్లా పాకాల మండలం మద్దినాయినిపల్లెలో దారుణం జరిగింది. గిరి అనే వ్యక్తి తన కుటుంబాన్ని ఘోరంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అనుమానాస్పద స్థితిలో అతడు తన భార్యను, ఇద్దరు కుమార్తెలను బావిలో తోసేసి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కుటుంబ కలహాలే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తీరు భయానకంగా మారింది. భార్యను, ఇద్దరు పసిబిడ్డలను బావిలోకి తోసిన గిరి, అనంతరం తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
#tirupati
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >