Posted on 2025-07-16 16:37:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నిజామాబాదుకు విచ్చేసిన సందర్భంగా, నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గవర్నర్ కి పుష్పగుచ్చంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా గవర్నర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమావేశమై ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, శాంతి భద్రతల అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపారు. గవర్నర్ పర్యటనకు హాజరైన శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు, "గవర్నర్ పర్యటన నిజామాబాదుకు ఎంతో గౌరవ కారణం అని. ఇది జిల్లా అభివృద్ధికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నట్లు," తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గవర్నర్ గారికి ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >