Posted on 2025-07-12 19:53:54
ఇండ్ల నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడొద్దు కాంట్రాక్టర్లకు ఆదేశం
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ నియోజవర్గం లోని ధర్పల్లి మండల కేంద్రంలో శనివారం ఇందిరమ్మ ఇళ్ళను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు నాణ్యత లో ఏ మాత్రం రాజీ పడకుండా నిర్మాణం చేసే విధంగా చూడాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా అర్హత ఉన్నవారికి ఇల్లు వస్తాయని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులతో మాట్లాడుతూ ఎవరైనా డబ్బులు అడిగారా.. అడిగితే నాకు వెంటనే ఫోన్ చేయండి అని అన్నారు. లబ్ధిదారులు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు సొంత ఇల్లు కల నెరవేరుతుందని ఆశ భావం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే వెంట ధర్పల్లి మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, మాజీ సర్పంచ్ మిట్టపల్లి గంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు , లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#nizamabad
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >