Posted on 2025-07-10 16:41:38
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు ఓ యువకుడు నిజామాబాద్ నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గురువారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి యత్నించాడు ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. నగరానికి చెందిన బాలాజీ అనే యువకుడు కంటిశ్వర్ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజీకి ఆనుకుని పానీ పూరి బండి నడుపుతూ జీవిస్తున్నాడు. అయితే ఇటీవల నగరానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సభ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు బాలాజీ పానీ పూరి బండిని అక్కడి నుంచి తీసేయించారు. అమిత్ షా పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో తన పానీపూరి బండి పెట్టుకుంటానని గురువారం ఉదయం బాలాజీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అడిగాడు. అయితే అందుకు పోలీసులు అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >