Posted on 2025-07-06 17:21:15
ఆందోళనలతో ఆస్పత్రికి తరలించిన తల్లిదండ్రులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇంట్లో ఆడుకుంటూ ఓ బాలుడు కాయిన్ మింగేశాడు.. తీరా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే బాలుడిని తీసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు.
ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట మండలం లింగంపల్లి కుర్దుకు చెందిన బందెల రాజు, సంతోష దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడైన రెండేళ్ల తన్వీర్ ఇంట్లో ఆడుకుంటుండగా.. రెండు రూపాయల కాయిన్ మింగేశాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే లింగంపేట్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్రే తీయగా కాయిన్ మధ్యలో ఇరుక్కుందని చెప్పారు. వెంటనే కామారెడ్డి ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో.. కుటుంబ సభ్యులు బాలుడిని కామారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈఎన్టీ వైద్యులు ఆధునిక పరికరాలతో బాలుడి గొంతులో ఇరుక్కున్న కాయిన్ తొలగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >