Posted on 2025-07-04 15:04:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో శనివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
శనివారంనాడు ఉదయం నిజామాబాద్, మధ్యహ్నం కామారెడ్డి జిల్లా లలో పర్యటిస్తున్నారని దళిత బహుజన ఫ్రంట్( డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్, కామారెడ్డి జిల్లా నాయకులు తలారి ప్రభాకర్, డిబిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బీబీపేట్ ప్రభాకర్ లు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలక నిజామాబాదు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి, భూమి సమస్యలు,రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చులు,అన్ని శాఖల సమీక్ష చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా స్థాయి సమీక్ష ఉంటుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటనను సద్వినియోగం చేసుకొని బాధితులు తమ సమస్యల పై వినతిపత్రాలు సమర్పించవచ్చని తెలిపారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >