Posted on 2025-07-03 19:50:47
ప్రభుత్వం ఇచ్చిన పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాళం వేసిన అధికారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు గురువారం రెవెన్యూ అధికారులు తాళాలు వేశారు. గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఇళ్లలో ఉంటున్న ఆరుగురు లబ్దిదారుల ఇళ్లకు తాళాలు వేసి నోటీసులు అతికించారు. దీంతో లబ్దిదారులు ఆందోళనకు దిగారు.తామంతా ఇళ్లలో ఉంటున్నామని అధికారులకు వివరించిన, వినిపించుకోకుండా తాళాలు వేసి జప్తు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారులు ఇళ్లకు తాళాలు వేయడంతో లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇళ్లను ఇచ్చి మళ్లీ లాక్కోవడం ఇంతవరకు సమంజసమని కన్నీరు పెట్టుకున్నారు.బీజేపీ నాయకుల పరామర్శవిషయం తెలుసుకున్న బీజేపీనాయకులులక్ష్మీనారాయణ, గంగారెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పేదలకు కేటాయించిన ఇళ్లను అధికారులు మళ్లీ లాక్కోవడం హేయమైనచర్యగా అభివర్ణించారు. తక్షణమే అధికారులు లబ్దిదారుల ఇళ్లను అప్పగించాలని కోరారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >