Posted on 2025-07-03 14:37:52
వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న హజరత్ బాబా సమాధిని తొలగించాలి : రాజన్న భక్తుడు మారవేని రంజిత్ కుమార్ డిమాండ్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గల హజరత్ బాబా సమాధిని తొలగించాలని మారవేని రంజిత్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి రెజిస్టర్డ్ పోస్టు ద్వారా వినతిపత్రం పంపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
"పవిత్ర శివలింగంపై మూత్ర విసర్జన చేసిన హజరత్ బాబా సమాధిని దేవాలయ ప్రాంగణంలో ఉంచడం హిందూ ధర్మాన్ని కించపరచే చర్య. ఇది ఆలయ పవిత్రతకు మంగళంకరం" అని అన్నారు.
ఇలాంటి వ్యక్తి సమాధి చుట్టూ మజార్ ధోరణిలో ప్రార్థనలు, మతపరమైన నినాదాలు జరుగుతుండటం ఆలయ ఆగమ నియమాలకు విరుద్ధమని, హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. దేవాలయ ప్రాంగణంలో అప్రామాణిక నిర్మాణాలు మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాగే, "ఖురాన్ ప్రకారమే అల్లా ఒక్కడే దేవుడని చెప్పబడిన తరుణంలో, ముస్లింలే ఇటువంటి మజార్ నిర్మాణాలను సమర్థించలేరు. కనుక మతాల మధ్య బాహ్య ఉద్రేకాలకు తావివ్వకుండా, మతాల గౌరవాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి" అని రంజిత్ కుమార్ కోరారు.
అలాగే, ఆలయ పరిసరాల్లో ఉన్న ఈ సమాధిని ఇతర అనుకూల ప్రదేశానికి తరలించి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ని కోరారు.
ఇది హిందూ భక్తుల మనోభావాలకు గౌరవం కల్పించడమే కాక, మతసామరస్యాన్ని పరిరక్షించే చర్య కూడా అవుతుందిని ఆయన స్పష్టం చేశారు.
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >