Posted on 2025-07-03 10:52:48
మైండ్ కేర్ సెంటర్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ పిలుపు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నెహ్రూ నగర్ లో ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల మరియు జిల్లా వైద్య ఆరోగ్య వైద్య శాఖ ఆధ్వర్యంలో కార్మికులకు మానసిక ఆరోగ్యంపై గ్రూప్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ ఏర్పాటు చేసినారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో న్యూరో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ బి. ప్రవీణ్ కుమార్ హాజరై కార్మికులకు కౌన్సిలింగ్, చికిత్స పద్దతులను గురించి వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాటడుతూ సమస్యలు ఎదురైనప్పుడు సానుకూల దృక్పథంతో ఆలోచించాలి అని అన్నారు.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని తెలుపుతూ సమస్యపై కాకుండా వాటి పరిష్కార మార్గాలపై దృష్టి నిలపాలని అన్నారు.
మద్యపాన వ్యసనం గురించి మాటాడుతూ దీనిపై కార్మికుల్లో అనేక అపోహలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో తనను సంప్రదిస్తే వైద్యం అందించి మద్యపాన వ్యసనం నుండి విముక్తి కల్పిస్తామని తెలిపారు.
తంబాకు నమలడం, బీడీ, సిగరెట్ త్రాగడం వల్ల అనేక శారీరక, మానసిక రుగ్మతలు వస్తాయని తెలిపారు.
చెడు అలవాట్ల వల్ల గుండె, ఛాతీలో మంట, అల్సర్స్, కాలేయం దెబ్బతినడం, మెదడు, నరాలు దెబ్బతిని మానసిక, శారీరక అనారోగ్యం ఏర్పడుతుందని అన్నారు.
సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికుల్లో ఎక్కువగా నిద్ర సమస్యలు ఉన్నాయని తెలుపుతూ వాటిని పరిష్కరించేందుకు మందులు, కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.
ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో తమను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ , సిబ్బంది రాపెల్లి లత, కొండ ఉమ, బుర్ల శ్రీమతి కార్మికులు పాల్గొన్నారు.
24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!
Posted On 2026-07-18 10:20:51
Readmore >ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తే పౌరసత్వం రద్దు కానట్లే : సుప్రీంకోర్టు
Posted On 2026-07-18 06:17:55
Readmore >రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు
Posted On 2026-07-18 06:16:11
Readmore >
జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Posted On 2026-07-17 17:49:23
Readmore >
భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
Posted On 2026-07-17 17:07:37
Readmore >
ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!
Posted On 2026-07-17 15:20:28
Readmore >
సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు
Posted On 2026-07-17 15:09:10
Readmore >
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్వో ఏంజెలా ఆల్ఫ్రెడ్
Posted On 2026-07-17 14:10:00
Readmore >