Posted on 2025-06-28 10:33:48
డైలీ భారత్, హనుమకొండ: జిల్లాలోని కాజీపేటలో దారుణ హత్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఫైనాన్షియల్ వివాదమే ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది. రైల్వే క్వాటర్లో నివసిస్తున్న నవీన్ కుమార్ ( 38)ను అదే ప్రాంతానికి చెందిన గడ్డం ప్రవీణ్ కుమార్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం రూ. 40,000 నగదు అడిగిన విషయం పై మాటామాటా పెరిగింది. ఉద్రిక్తత ముదిరి కత్తితో దాడికి దిగిన ప్రవీణ్, నవీన్ పై నేరుగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఫైనాన్షియల్ నడుపుతున్న నవీన్ కుమార్ కొద్ది రోజుల కిందట ప్రవీణ్ కు 40,000 ఇచ్చాడని ఆ డబ్బులు అడిగినందుకే ప్రవీణ్ ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పై నవీన్ కుమార్ భార్య మాధవి కాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >