Posted on 2023-12-10 09:10:47
డైలీ భారత్, చత్తీస్ ఘఢ్ : ఛత్తీస్గఢ్ నారాయణ్పూర్ జిల్లా చోతేదోంగర్ గ్రామ స్థుడ్ని శనివారంసాయంత్రం నక్సలైట్లు గొడ్డలితో నరికి చంపారు. మృతుడు కోమల్ మంఝ అని పోలీస్లు గుర్తించారు.
చోతేదోంగర్ గ్రామంలో పేరు పొందిన నాటువైద్యుని మేనల్లుడు మంఝ ఆయన తన మేనమామతో కలిసి ఆలయంలో పూజలు చేసి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగింది.
వీరిద్దరికీ గతంలో చంపు తామని బెదిరింపులు కూడా వచ్చాయని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. గత నెల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా లోని మారుమూల ప్రాంతాలకు చెందిన కొంతమందిని నారాయణ్పూర్ జిల్లా కేంద్రానికి తరలించి భద్రత కల్పించారు. వారిలో వీరిద్దరు ఉన్నారు.
రెండవ దశ పోలింగ్ పూర్తి అయిన తరువాత వీరిద్దరూ తమ గ్రామానికి తిరిగి వచ్చేశారు. తమకు ఇక రక్షణ అక్కరలేదని తిరస్కరించారని పోలీస్ అధికారి తెలిపారు.
మంఝహత్య సంగతి తెలియగానే పోలీస్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలిం చారు. హత్య జరిగిన చోట మావోయిస్టుల చేతిరాత కాగితం దొరికింది.
మంఝ,అందాయి ఘాటి ఇనుప ఖనిజం గని ఏజెంట్గా పని చేస్తు న్నాడని, భారీగా డబ్బు సంపాదిస్తున్నాడని నోట్లో రాసి ఉంది. మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >