Posted on 2025-05-05 18:04:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కట్టుగూడెం పాత పెంకు ఫ్యాక్టరీలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు చేసి పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పేకాట ఆడుతున్న విషయం తెలుసుకొని దాడి చేయగా ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని ఒకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. పేకాట స్థావరం పై దాడిలో రూ.46 వేలు నగదు, 8 సెల్ ఫోన్లు, ఒక కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 9 మంది పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సందర్భంగా సీఐ బత్తుల సత్యనారాయణ అన్నారు. ఈ దాడిలో ఇల్లెందు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >