Posted on 2025-05-02 17:52:38
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని కెరీర్ గైడెన్స్ ఇంచార్జ్ ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు SSC ఫలితాలు వచ్చిన తరువాత నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించడం జరిగిందని నారాయణ తెలిపారు ( గత విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాల లో ఒక ఉపాధ్యాయుడికి కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పై రెండు రోజులు శిక్షణ కార్యక్రమo ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే )మంచి కోర్స్ అని చూడకుండా ఎవరికి ఇష్టమైన కోర్సు వారు ఎన్నుకొని చదువు ఆగిపోకుండా చూసుకోవాలన్నారు భవిష్యత్తులో ఏ వృత్తిలో ( ఉపాధ్యాయులు, అధ్యాపకులు, లాయరు, ఇంజనీరు, డాక్టరు గా ) స్థిరపడాలో ఇప్పుడే నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ( MPC, BiPC CEC, HEC, MEC ) కోర్సులు ఎన్నుకోవాలని తెలియజేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు ( జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగం ఇంచార్జ్ ) అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడికి కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పై రెండు రోజులు శిక్షణ ఇవ్వడం మంచి ఉద్దేశం అని పదవ తరగతి తర్వాత ఏమి చేయాలో ఇటు విద్యార్థులకు అటు తల్లిదండ్రులకు ఎక్కువ శాతం తెలియడం లేదన్నారు ప్రతి పాఠశాల కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇన్చార్జిలు విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఇట్టి కార్యక్రమంలోఉపాధ్యాయులు గుడికాడి కొమురయ్య విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >