Posted on 2025-04-10 14:14:24
డైలీ భారత్, హైదరాబాద్: పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాద య్యగౌడ్ మాట్లాడుతూ..
పెండింగ్ బిల్లులు రాక సర్పంచ్లు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని చెప్పారు. ఈ రోజు, రేపు అంటూ బిల్లుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు విడుదల చేయకపోగా రేవంత్ ప్రభుత్వం మాజీ సర్పంచ్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు.
పెండింగ్ బిల్లుల కోసం సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసినా ఫలితం కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను విడుదల చేసేంత వరకు ప్రతీ రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లో సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లయ్య, కార్యదర్శి, నాయకులు పాల్గొన్నారు.
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >