Posted on 2023-12-05 15:52:38
కేసు నమోదు చేసిన పోలీసులు
డైలీ భారత్ సిరిసిల్ల :సిరిసిల్ల మునిసిపల్ పరిధిలోని 37వ వార్డు కౌన్సిలర్ దిడ్డి మాధవి భర్త బిఆర్ఎస్ నాయకుడు దిడ్డి రాజుపై మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఏఈ నరసింహస్వామి సిరిసిల్ల సిఐ ఉపేందర్కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 23న మురికి కాలువ నిర్మాణం విషయంలో స్థానిక కౌన్సిలర్ భర్త తాను చెప్పిన విధంగా నిర్మాణం జరగాలని హుకుం జరిగాయని బాధితుడు తెలిపాడు. మురికి కాలువ నిర్మాణం విరుద్ధంగా నోటీసు ఉందని అధికారి వాదించటానికి ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో తిడుతూ... కులం పేరుతో దూషించాడని నరసింహస్వామి ఆవేదన చేశారు. మాజీ మున్సిపల్ కమిషనర్ ను సైతం బదిలీ చేయించానని, నువ్వెంత నీ బతుకెంత అంటూ బెదిరింపులకు పల్పడ్డడని ఆయన చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో, తనకు అధికారులు ఎన్నికల డ్యూటీ ఇచ్చినట్లు లేక మంగళవారం టౌన్ సిఐ ఉపేందర్కు ఫిర్యాదులు అందజేసినట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ ఏ నరసింహస్వామికి మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు ఉద్యోగులు అండగా నిలిచారు. సంబంధిత కౌన్సిలర్ భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిక్ సిటీ కేసు నమోదు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆయనపై చాలా ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. సదరు వ్యక్తి అధికారులను నిత్యం వేధిస్తూ భూకబ్జాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలే అధికారం పోయిందని నిరాశతో ఉన్న కేటీఆర్ కు కౌన్సిలర్ భర్త నిర్వాకం తలనొప్పిగా మారిందని పట్టణ వ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-16 17:38:06
Readmore >ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >