Posted on 2024-05-16 19:23:17
డైలీ భారత్, నర్సాపూర్: ఏసీబీ వలకు నర్సాపూర్ పట్టణ వ్యవసాయ అధికారి గురువారం చిక్కాడు. బాదితుడు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర క్యాంప్ గ్రామానికి చెందిన వంగ నరేన్ ఎంఎస్ శివశక్తి ట్రేడ్ లైసెన్స్ నర్సాపూర్ పేరుతో ఫార్వార్డ్ చేయడం కోసం నర్సాపూర్ మండల వ్యవసాయాధికారి అనిల్ కుమార్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం మండల వ్యవసాయాధికారి అనిల్ కుమార్ రూ.30వేలు లంచం ఇవ్యాలని డిమాండ్ చేశాడు.
దీంతో విసుగు చెందిన బాదితుడు వంగ నరేన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నర్సాపూర్ వ్యవసాయ కార్యాలయంలో బాదితుని నుంచి లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు ఏసీబీ డిఎస్పీ మెదక్ రేంజ్ కె.సుధార్శన్, ఇన్పెక్టర్లు వెంకట రాజాగౌడ్, రమేష్ లు పట్టుకున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఏసీబీ డిఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం ఏవో అనిల్ కుమార్ హైదరాబాద్ యాంటీ కరప్షన్ బ్యూరో అధికారుల అదుపులో ఉన్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >