Posted on 2025-02-07 14:03:03
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో సిరిసిల్లలోని బి.వై. నగర్ నందు పవర్ లూమ్ కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ మనోవికాస సదస్సును ఈరోజు నిర్వహించినారు.
ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నం చందర్ మాటాడుతూ ఆరోగ్య పరిరక్షణకు కార్మికులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలుపుతూ దురలవాట్లకు కార్మికులు దూరంగా ఉండాలని కోరారు.
మద్యపాన వ్యసనం శారీరక మానసిక రుగ్మతలకు కారణమై వ్యక్తి సామాజికంగా, ఆర్థికంగా పతనానికి దారితీస్తుందని తెలిపారు.
తంబాకు నమలడం, సిగరెట్ త్రాగడం, అతిగా టీలు త్రాగడం వల్ల క్యాన్సర్ లు, గ్యాస్ట్రిక్ సమస్యలుగా ఎక్కువగా వస్తున్నాయని అన్నారు.
దురలవాట్ల నుండి దూరం కావాలనుకున్నవారు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ లో సంప్రదించాలని కార్మికులకు సూచించారు.
దురలవాట్లను తగ్గించుకునే విధానాలను గురించి కార్మికులకు మెళకువలు నేర్పించారు.
జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎదుర్కొనే విధానాలను గురించి వివరిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని కోరారు.
నిద్ర సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు వస్తే నిర్లక్ష్యం చేయొద్దని వెంటనే కౌన్సిలింగ్ తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పారిశ్రామికుడు హన్మండ్ల రామనారాయణ, మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది వేముల అన్నపూర్ణ, బూర శ్రీమతి, కొండ ఉమ, రాపెల్లి లత మరియు కార్మికులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >