Posted on 2025-02-07 13:47:59
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండలంలోని నాగుల పల్లి గ్రామంలో ఎస్సీ వర్గీకరణ,బిసి కుల గణన అసెంబ్లీ లో ఆమోదం పొందిన సందర్భంగా నిర్వహించిన సంబరాలలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. అనంతరం షాద్ నగర్ నుండి ఈదులపల్లి వరకు బి.టి రోడ్డు వయా నాగులపల్లి - 4.00 KM (1.70 కోట్లు, నాగులపల్లి నుండి రాసమళ్ళ గూడ వరకు బీ.టీ రోడ్డు - 1.00 కి. మి (60 లక్షలు)
పనులకు,గ్రామంలో ఎస్సీ SDF 7.0 లక్షల నిధులతో ఎస్సీ కాలనీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 4 వ తేదీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని ఒక సువర్ణ దినంగా మారింది అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్,ఉత్తమ్ కుమార్ రెడ్డి,మల్లు రవి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన క్షేత్ర స్థాయి సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించిన అనంతరం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు అని తెలిపారు.గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసి ఫలితాలను కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకున్నారని మండిపడ్డారు. లిమ్కా బుక్ రికార్డ్ కోసం నివేదికలు పంపిన గత పాలకులు ప్రజల్లో ఎందుకు పెట్టలేదని,చట్ట బద్ధత ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీసీ ల సంఖ్య తగ్గిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కంటే ఓసీల సంఖ్య పెద్దగా మార్పు లేదన్నారు. బి ఆర్ ఎఎస్ హయాంలో 20% శాతం చూపించిన ఓసీ ల లెక్కలు 15% ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల రాజకీయ ఉనికి దెబ్బ తింటుందని కొందరు మూర్ఖులు తమ అభద్రత భావాన్ని చెప్పలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ,ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా కులాలకు అతీతంగా,రాజకీయాలకు అతీతంగా సామాజిక న్యాయంతో ముందుకు సాగుతుందని తెలిపారు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ సైనికులు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బాలరాజు గౌడ్, కొండూర్గ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, నాయకులు రఘు నాయక్, ఇబ్రహీం, అరుంధతి, రాజు, రాములు గౌడ్,యాదయ్య, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >