Posted on 2024-12-27 13:54:02
డైలీ భారత్, తమిళనాడు డెస్క్: 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించిన అన్నామలై
అన్నా యూనివర్సిటీ కేసులో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశారని ఆగ్రహం
బాధితురాలి పేరు, ఫోన్ నెంబర్ను లీక్ చేశారన్న అన్నామలై
తమిళనాట డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను చెప్పులు ధరించనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రతిజ్ఞ చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆయన వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల అంశంపై రాజకీయ దుమారం రేగింది. ఈ అంశంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం నాడు కోయంబత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అన్నా యూనివర్సిటీలో జరిగిన లైంగిక వేధింపుల కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, నిరసనలో భాగంగా శుక్రవారం నాడు తన నివాసం వద్ద ఆరుసార్లు కొరడాతో కొట్టుకుంటానన్నారు. రేపటి నుంచి 48 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే పార్టీని గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనన్నారు.
అన్నా యూనివర్సిటీ కేసుకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని అధికారులు లీక్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో బాధితురాలికి సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారని మండిపడ్డారు. ఆమె పేరును, ఫోన్ నెంబర్ను ఎఫ్ఐఆర్ ద్వారా లీక్ చేశారని మండిపడ్డారు. తద్వారా పోలీసులు ఈ కేసులో సరిగ్గా వ్యవహరించలేకపోయారన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >