Posted on 2024-11-02 14:48:02
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 నవంబర్ తెలంగాణ సీమ రత్నం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో.. ఇంచార్జ్ దాసరి సాంబయ్య..
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కి తమ సమస్యల పరిష్కారానికై వినతిపత్రం అందజేసిన జిల్లా హోంగార్డ్స్ ఆఫీసర్స్ అసోసియేషన్..
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ,శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడే పోలీసులకు సహాయకారులుగా పనిచేసే హోంగార్డు ఆఫీసర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని హోంగార్డ్స్ సమస్యలను అసోసియేషన్ తరపున వినతిపత్రం రూపంలో ఎస్పీ కి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు ఆఫీసర్స్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.జిల్లాలోని ఆస్పత్రుల్లో,విద్యా సంస్థల్లో ఫీజుల రాయితీ గురించి యాజమాన్యాలతో చర్చిస్తామని తెలియజేసారు.జిల్లాలో పనిచేసే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరూ క్రమశిక్షణతో,సమయపాలన పాటిస్తూ తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.ఉద్యోగ పరంగా మరియు వ్యక్తిగత పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ ఈ సందర్బంగా కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, హోమ్గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు,ఎంటిఓ సుధాకర్, హోంగార్డ్స్ అసోసియేషన్ సభ్యులు మరియు తదితరులు పాలోన్నారు...
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >